Breaking News

నాంపల్లి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో నృసింహ జయంతి

నాంపల్లి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో నృసింహ జయంతి

సారథి, వేములవాడ: వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి దత్తత దేవస్థానంగా ఉన్న నాంపల్లిగుట్టపై వెలసిన లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో దివ్య కల్యాణ మహోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి అభిషేకం, నిత్యహోమం, సహస్రనామార్చన, వేదవిన్నపాలు నిర్వహించారు. తీర్థప్రసాద వితరణ చేశారు. కార్యక్రమంలో అర్చకస్వాములు రమణాచారి, విజయసింహచారితో పాటు పర్యవేక్షకులు అల్లి శంకర్, ఇన్ చార్జ్ నూగురి నరేందర్ పాల్గొన్నారు.