Breaking News

రిపబ్లిక్ ​డే వేడుకల్లో కొత్త శకటాలు

రిపబ్లిక్​డే వేడుకల్లో కొత్త శకటాలు

న్యూఢిల్లీ: రిపబ్లిక్​ డే వేడుకలు ఈ సారి విభిన్నంగా వినూత్నరీతిలో కొనసాగనున్నాయి. ఈ ఏడాది ఎన్నో కొత్త శకటాలు దర్శనమివ్వనున్నాయి. రఫేల్‌ యుద్ధవిమానాలను తొలిసారిగా ఈ ఏడాది పరేడ్‌లో ప్రదర్శించనున్నారు. గత సెప్టెంబర్‌లో ఫ్రాన్స్‌ నుంచి వచ్చిన ఈ విమానాలు భారత వైమానిక దళంలో చేరాయి. మొట్టమొదటిసారిగా మహిళా యుద్ధ పైలెట్‌ లెఫ్ట్‌నెంట్‌ భావనాకాంత్‌ ప్రదర్శనలో పాల్గొననున్నారు. భారత వాయుసేనకు చెందిన తేలికపాటి యుద్ధవిమానాలు, యుద్ధ హెలికాప్టర్లు, సుఖోయ్‌–30 విమాన శకటాలను భావన ముందుండి నడిపిస్తారు. రిపబ్లిక్​ డే వేడుకల్లో తొలిసారిగా లద్దాఖ్‌ ప్రాతినిథ్యం వహించనుంది. లేహ్‌ జిల్లాలో చారిత్రక థిక్సే మఠాన్ని ప్రదర్శించనున్నారు. థిక్సే కొండలపై ఉన్న ఈ మఠం ఒక పర్యాటక కేంద్రంగా విరాజిల్లుతోంది. ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో నిర్మాణంలో ఉన్న రామమందిరం తొలిసారిగా శకటంగా దర్శనమివ్వనుంది.