Breaking News

జిల్లెలగూడ చెరువుకు కొత్త సొబగులు

జిల్లెలగూడ చెరువుకు కొత్త సొబగులు

సారథి న్యూస్, హైదరాబాద్: సుమారు రూ.3.65 కోట్ల వ్యయంతో సుందరీకరణ పనులు చేపట్టిన హైదరాబాద్​లోని జిల్లెలగూడ చందనం చెరువును శుక్రవారం విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రజలకు అంకితం చేశారు. చెరువు చుట్టూ వాకింగ్ ట్రాక్, ఫెన్సింగ్​, బతుకమ్మ ఘాట్, ప్లాంటింగ్, ఐలాండ్, పక్షులు, జంతువుల బొమ్మలతో చేపట్టిన పనులు స్థానికులను ఆకట్టుకుంటున్నాయి. కాంక్రీట్​ జంగిల్​గా మారుతున్న పట్టణ ప్రాంతాల్లో ప్రజలు సేదతీరడానికి చెరువు పరిసరాలు, పార్కులు దోహదపడతాయని, గొలుసుకట్టు చెరువులను దశలవారీగా అభివృద్ధి చేస్తామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. పెద్దచెరువును రూ.ఏడు కోట్లతో అభివృద్ధి చేస్తామన్నారు. మీర్​పేట కార్పొరేషన్​పరిధిలో రూ.60లక్షల వ్యయంతో అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. స్వచ్ఛ మీర్​పేట కోసం అందరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు.

మంత్రి సబితా ఇంద్రారెడ్డితో నాయకులు, కార్యకర్తలు, అధికారులు