సారథి న్యూస్, హైదరాబాద్: సుమారు రూ.3.65 కోట్ల వ్యయంతో సుందరీకరణ పనులు చేపట్టిన హైదరాబాద్లోని జిల్లెలగూడ చందనం చెరువును శుక్రవారం విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రజలకు అంకితం చేశారు. చెరువు చుట్టూ వాకింగ్ ట్రాక్, ఫెన్సింగ్, బతుకమ్మ ఘాట్, ప్లాంటింగ్, ఐలాండ్, పక్షులు, జంతువుల బొమ్మలతో చేపట్టిన పనులు స్థానికులను ఆకట్టుకుంటున్నాయి. కాంక్రీట్ జంగిల్గా మారుతున్న పట్టణ ప్రాంతాల్లో ప్రజలు సేదతీరడానికి చెరువు పరిసరాలు, పార్కులు దోహదపడతాయని, గొలుసుకట్టు చెరువులను దశలవారీగా అభివృద్ధి చేస్తామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. పెద్దచెరువును రూ.ఏడు కోట్లతో అభివృద్ధి చేస్తామన్నారు. మీర్పేట కార్పొరేషన్పరిధిలో రూ.60లక్షల వ్యయంతో అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. స్వచ్ఛ మీర్పేట కోసం అందరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు.
- February 5, 2021
- Archive
- రంగారెడ్డి
- లోకల్ న్యూస్
- GILLELAGUDA
- MEERPET
- SABITHAINDRAREDDY
- జిల్లెలగూడ
- మంత్రి సబితాఇంద్రారెడ్డి
- మీర్పేట
- హైదరాబాద్
- Comments Off on జిల్లెలగూడ చెరువుకు కొత్త సొబగులు