Breaking News

ఎస్సై శీను మృతికి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ నివాళి

ఎస్సై శీనునాయక్ మృతికి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ నివాళి

సామాజిక సారథి, కల్వకుర్తి: రెండు రోజుల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో మాడ్గుల మండలం మాన్యతండాకు చెందిన ఎస్సై శ్రీనునాయక్ రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. వికారాబాద్ లో విధులు నిర్వహిస్తూ ఇటీవలే జరిగిన వివాహ అనంతరం ఒడిబియ్యం పోసుకుని తిరుగు ప్రయాణంలో తండ్రితో పాటు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. వారి పార్థివదేహాలకు పూలమాల వేసి కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి  నివాళులర్పించారు. రూ.20వేల ఆర్థిక సహాయం అందజేసి ప్రభుత్వం తరపున కుటుంబాన్ని అన్ని విధాలుగా అదుకుంటామని ఎమ్మెల్యే జైపాల్ యాదవ్  హామీ ఇచ్చారు.

  • పలువురికి పరామర్శ

కుబ్యాతండా మాజీ సర్పంచ్ వెంకట్రాము నాయక్ తల్లి  అనారోగ్యంతో చనిపోయారు. మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ అర్కపల్లి గ్రామంలో మాజీ సర్పంచ్ వెంకటయ్య గారి భార్య అండాలు సభ్యులను పరామర్శించారు. అలాగే ఎమ్మెల్యే జైపాల్ యాదవ్అదే గ్రామంలో చనిపోయిన కె.జంగయ్య కుటుంబ సభ్యులను పరామర్శించారు. కొత్త బ్రహ్మణపల్లి గ్రామంలో బాల్ రెడ్డి  అనారోగ్యంతో చనిపోగా, పార్థివదేహానికి నివాలర్పించారు. ఈ కార్యక్రమాల్లో మండల గ్రామాల ప్రజాప్రతినిధులు పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.