Breaking News

మెడికల్ కాలేజీ మంజూరుపై హ‌ర్షం

మెడికల్ కాలేజీ ఏర్పాటుపై హ‌ర్షం

సారథి, బిజినేపల్లి: నాగర్ కర్నూల్ జిల్లాలో మెడికల్ కాలేజీ మంజూరుపై బిజినేపల్లి మండలవాసులు హర్షం వ్యక్తం చేశారు. సోమవారం మండల కేంద్రంలో సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం కళాశాల మంజూరు చేశారని పేర్కొన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కుర్మయ్య, ఎంపీపీ శ్రీనివాస్ గౌడ్, సహకార సంఘం చైర్మన్ బాల్ రాజ్ గౌడ్, రైతు సంఘం మండలాధ్యక్షుడు మహేష్ రెడ్డి, సర్పంచులు అశోక్, సుదర్శన్, ఎంపీటీసీలు బాలస్వామి, మంగి విజయ్, తిరుపతి రెడ్డి, మైమూద్ ఖాన్, దామోదర్ గౌడ్, పర్వతాలు, తిరుపతిరెడ్డి, రాజశేఖర్, అనిల్ గౌడ్, రమణ గౌడ్, శ్రీశైలం రెడ్డి, నసీర్, గోపి నాయక్, పర్వతాలు యాదవ్, గట్టు, శివయ్య యాదవ్, నరేందర్ గౌడ్, మధు తదితరులు పాల్గొన్నారు.