Breaking News

దాడుల్లో పంథా మారిందా?

దాడుల్లో పంథా మారిందా?

మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లా ఏటపల్లి తాలూకా గట్టా పోలీస్ స్టేషన్ పై బుధవారం అర్ధరాత్రి మావోయిస్టులు రాకెట్ లాంచర్ తో దాడిచేశారు. గోడకు తగలడంతో పెద్ద రంధ్రం పడింది. హ్యాండ్ మేడ్ రాకెట్ లాంచర్ గా గుర్తించారు. ఈ ఘటనపై పోలీసు అధికారులు ఆరాతీస్తున్నారు. ఈ దాడిలో ప్రమాదం జరగకపోవడంతో కొంత ఊపిరి పీల్చుకున్నారు. డ్రోన్ కెమెరాలతో అడవిలో మావోయిస్టులపై దాడి చేస్తున్నారని ఆరోపణలు చేసిన కొన్నిగంటల వ్యవధిలోనే లాంచర్ తో ఠాణాపై దాడికి పాల్పడడం గమనార్హం. డ్రోన్ బాంబులకు ప్రతీకారంగా దాడి చేసినట్లు తెలిసింది.