Breaking News

పూడిక మట్టితో పంటలకు జీవం

పూటికమట్టితో పంటలకు జీవం

సారథి, రామాయంపేట: ఉపాధి హామీ పథకం ద్వారా తీస్తున్న పూడిక మట్టి పంటలకు సేంద్రియ ఎరువుగా పనిచేస్తుంది. రైతుల పంట సాగుకు అయ్యే ఖర్చు కూడా బాగా తగ్గుతుంది. భూసారం పెరిగి అధిక దిగుబడులు వచ్చే అవకాశాలు ఉన్నాయని, అలాగే పర్యావరణం దెబ్బతినకుండా ఉంటుందని వ్యవసాయ అధికారులు రైతులు సూచిస్తున్నారు. ఉపాధి హామీ పనులు పనిచేస్తున్న కూలీల వద్ద నుంచి ఉచితంగా పూడికమట్టిని తీసుకోవచ్చని, ట్రాక్టర్ కిరాయి చెల్లించాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు.
పూడిక మట్టితో లాభాలు ఇవే
కుష్కీ, తరి భూముల్లో భూసారం పెంచేందుకు నల్లమట్టిని పొలాలకు తరలిస్తారు. తద్వారా అధిక దిగుబడులు వచ్చే అవకాశం ఉంది.రైతులు ఎక్కువగా ఒకేరకమైన పంటలను సాగుచేస్తారు. ప్రతిసారి పంటల మార్పిడితో పాటు భూమిలో పూడిక మట్టిని చల్లుకోవాలి. పూడిక మన్ను చల్లడం ద్వారా భూసారం పెరిగి పంట దిగుబడి అధికంగా వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. పశువుల పేడ, వేప నూనె వేసుకోవడం ద్వారా అవి భూమిలో కుళ్లిపోయి నేల సారవంతమవుతుంది. గ్రామాల్లో ప్రస్తుతం ఉపాధి హామీ పనుల్లో ఎక్కువగా చెరువులు, కుంటల్లో పూడికమట్టిని తీస్తున్నారు.