Breaking News

బరిలో ఉంటాం.. మా ఓట్లు మేమే వేసుకుంటాం

బరిలో ఉంటాం.. మా ఓట్లు మేమే వేసుకుంటాం

సామాజిక సారథి, నాగర్ కర్నూల్ ప్రతినిధి: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈసారి కచ్చితంగా ఎంపీటీసీల సంఘం తరఫున ఎమ్మెల్సీ పోటీలో ఉంటామని సంఘం నాయకులు సుహాసినిరెడ్డి, ఆంజనేయులు ప్రకటించారు. సోమవారం నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రతి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంపీటీసీలు, ఎంపీపీలు, జడ్పీటీసీలను ఓట్లకు మాత్రమే వాడుకుంటున్నారని ఆక్షేపించారు. మండలిలో గెలిచిన ఎమ్మెల్సీలు ఎంపీటీసీల సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఇక ప్రజాప్రతినిధులు బెదిరించినా భయపడేది లేదని, తమ సమస్యలను తామే పరిష్కరించుకుంటామని స్పష్టం చేశారు. ఇక ముందుకే సాగుతామని ఏకధాటిగా తీర్మానాలు చేశారు. ఈనెల 18న పోటీలో ఉండే అభ్యర్థి పేరు ప్రకటిస్తామని చెప్పారు. ఏళ్ల తరబడి ఎంపీటీసీలు, ఎంపీపీలు, జడ్పీటీసీలకు గ్రామాల్లో గుర్తింపు లేదని, అరకొర నిధులతో ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందన్నారు. వాటి పరిష్కారం కోసమే ఎమ్మెల్సీగా నిలబడి తమ సత్తా ప్రభుత్వానికి తెలియజేస్తామని హెచ్చరించారు. సమావేశంలో ఎంపీటీసీలు బత్తిని తిరుపతిరెడ్డి, శ్రీనివాస్ గౌడ్, చంద్రకళ, రఘుమారెడ్డి, తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు.