Breaking News

బాలల హక్కులను రక్షిద్దాం

బాలల హక్కులను రక్షిద్దాం

సారథి న్యూస్, మెదక్: పిల్లల భవిష్యత్​ను తీర్చిదిద్దాల్సిన బాధ్యత అందరిపై మనందరిపై ఉందని బాలల హక్కుల కమిషన్ రాష్ట్ర సభ్యురాలు రాగ జ్యోతి అన్నారు. శుక్రవారం మెదక్​ కలెక్టరేట్​లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు. బాలల హక్కులకు భంగం కలిగిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. సర్పంచ్​లు, ప్రజాప్రతినిధులు, అధికారుల సహకారంతో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. చిన్నపిల్లలను పనులకు తీసుకోకూడదన్నారు. తాను మెదక్ జిల్లాలో ఒక గ్రామాన్ని దత్తత తీసుకుని ఆదర్శంగా తీర్చిదిద్ది రాష్ట్రంలో ఒక మోడల్ గా ఉంచేందుకు కృషిచేస్తానని ప్రకటించారు. కార్యక్రమంలో డీఆర్డీవో శ్రీనివాస్, జిల్లా సంక్షేమాధికారి రసూల్ బీ, డీఎంహెచ్​వో వెంకటేశ్వర్లు, ఎస్సై రాథోడ్ తదితరులు పాల్గొన్నారు.