Breaking News

స్త్రీమూర్తిని స్మరించుకుందాం

స్త్రీమూర్తిని స్మరించుకుందాం

సారథి న్యూస్, వెంకటాపూర్: కనుపాపల తలచి, ఆత్మీయతను పంచి, కుటుంబం కోసం అహర్నిశలు కష్టించే స్త్రీమూర్తిని స్మరించుకోవడం అందరి బాధ్యత అని సర్వర్ ఫౌండేషన్ సభ్యులు అన్నారు. సోమవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మండలంలోని మహిళామణులను శాలువాలతో ఘనంగా సన్మానించారు. సర్వర్ ఫౌండేషన్ వ్యస్థాపకురాలు, సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహమ్మద్ ఆదేశాల మేరకు ములుగు జిల్లా వెంకటాపూర్ గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న సిబ్బంది, పోలీసు స్టేషన్ లో మహిళా పోలీస్​కానిస్టేబుళ్లు, జవహర్ నగర్ పెట్రోల్ బంకులో పనిచేస్తున్న మహిళలను శాలువాలతో ఘనంగా సన్మానించారు. స్త్రీ లేకపోతే సృష్టిలో జీవం లేదని, కుటుంబభారాన్ని మోసి, సర్వం త్యాగం చేస్తున్న మహిళలకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో సర్వర్ ఫౌండేషన్ సభ్యులు మామిడి పెల్లి రమేష్, రాసమళ్ల హేమంత్, చంటి అనిల్, రాజ్ కుమార్, అత్తిని శ్రీకాంత్, అశోక్, కాడపాక శ్యాం, శేఖర్, బన్ని పాల్గొన్నారు.

ఆశా కార్యకర్తకు ఘనసన్మానం
సారథి న్యూస్, వాజేడు: వాజేడు ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని వాజేడు సబ్ సెంటర్ లో ఆశా కార్యకర్తగా పనిచేస్తున్న చింతా పుష్పలతను అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఇన్​చార్జ్ జిల్లా వైద్యాధికారి డాక్టర్ రవీందర్, డీఐవో శ్యామ్ సుందర్ పాల్గొన్నారు.

ఆశా కార్యకర్త చింతా పుష్పలతను సన్మానిస్తున్న వైద్యాధికారులు