Breaking News

కొల్లాపూర్​ పీజీ కాలేజీ ప్రిన్సిపల్​ దుర్మరణం

కొల్లాపూర్​ పీజీ కాలేజీ ప్రిన్సిపల్​ దుర్మరణం

సామాజిక సారథి, నాగర్​ కర్నూల్​ ప్రతినిధి​: నాగర్​ కర్నూల్ ​జిల్లా కొల్లాపూర్​ ప్రభుత్వ పీజీ కాలేజీ ప్రిన్సిపల్ ప్రభాకర్​ రెడ్డి(48) ఇకలేరు. శనివారం ఉదయం నాగర్ కర్నూల్ నుంచి కొల్లాపూర్ వెళ్తుండగా నాగర్ కర్నూల్​ దాటిన తర్వాత నెల్లికొండ చౌరస్తాలో అతివేగంతో వచ్చిన కారుఆయనను ఢీకొట్టింది. దీంతో ప్రభాకర్ రెడ్డి అక్కడికక్కడే మృత్యువాతపడ్డారు. ఈ ఘటనతో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. బిజినేపల్లి మండలం పాలెం గ్రామానికి చెందిన ప్రభాకర్​రెడ్డి ఎంతో మంది విద్యార్థులను తీర్చిదిద్దిన అధ్యాపకుడిగా ఆయనకు మంచి పేరుంది. తమ గురువు ఇక లేరన్న విషయాన్ని స్టూడెంట్స్​ జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన భౌతికకాయాన్ని సందర్శించేందుకు తరలివస్తున్నారు.