![కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్ పేదలకు అండ](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2021/06/cm-1f.jpg?fit=655%2C346&ssl=1)
సారథి, రామడుగు: కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్ చెక్కులను స్థానిక ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ 45 మంది లబ్ధిదారులకు రూ.45,05,200 విలువైన చెక్కులను గురువారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్నివర్గాల అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఆడపిల్లల పెళ్లి పేదలు అప్పుచేసి చేసేవారని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు. సీఎం కేసీఆర్ ఆడబిడ్డలకు మేనమామగా ప్రతిఒక్కరికీ రూ.లక్ష నూట పదహార్లు నేరుగా అందిస్తున్నారని పేర్కొన్నారు. అయితే కరోనా విజృంభణ నేపథ్యంలో నాయకులంతా గుమికూడి చెక్కులు పంపిణీ చేయడంపై విమర్శలు వ్యక్తమయ్యాయి. కార్యక్రమంలో పలు గ్రామాల సర్పంచ్ లు, ఎంపీటీసీలు, నాయకులు పాల్గొన్నారు.