Breaking News

మరో మూడురోజులు వర్షాలు

మరో మూడురోజులు వర్షాలు
  • బంగాళాఖాతంలో అల్పపీడనం
  • వాతావరణశాఖ వెల్లడి

సామాజికసారథి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాలను వర్షాలు వీడటం లేదు. ఇటీవల కురిసిన వర్షాల నుంచి తేరుకోకముందే మరో ముప్పు పొంచి ఉంది. రానున్న మూడు రోజుల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​రాష్ట్రాల్లో భారీవర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. శ్రీలంక నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ఆవరించి సముద్ర మట్టానికి 0.9 కి.మీ. ఎత్తులో నిక్షిప్తమైందని వెల్లడించింది. తెలంగాణకు వర్షసూచన ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణశాఖ అధికారులు తెలిపారు. రెండు రోజుల్లో పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. ఉష్ణోగ్రతల్లో కూడా స్వల్ప మార్పులు ఉంటాయని వివరించారు. ఇటీవల వర్షం ముప్పు వీడకముందే ఏపీలో మరోసారి భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో మూడు రోజులపాటు వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. అనంతపురం, కడప జిల్లాల్లో మోస్తరు నుంచి భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రకాశం జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ రిపోర్టులో పేర్కొన్నారు.