![City, IT, Companies, Hyderabad, MLC, Kalvakuntla, Kavitha,](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2021/12/11HSB8.jpg?fit=600%2C350&ssl=1)
- ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
సామాజికసారథి, హైదరాబాద్: హైదరాబాద్ చట్టూ ఐటీ కంపెనీలు విస్తరిస్తున్నాయని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఉప్పల్ అబాకస్ ఐటీ పార్క్లో సాలిగ్రామ్, టెక్ స్మార్ట్ ఐటీ కంపెనీ నూతన కార్యాలయాన్ని స్థానిక ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డితో కలిసి ఆమె శనివారం ప్రారంభించారు. ఐటీ రంగాన్ని హైదరాబాద్లో అన్ని వైపులా విస్తరించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం లుక్ ఈస్ట్ పాలసీ తీసుకొచ్చిందని గుర్తుచేశారు. అందులో భాగంగా ఉప్పల్ కారిడార్లో అనేక ఐటీ పరిశ్రమలు నెలకొల్పుతుండటంపై ఎమ్మెల్సీ కవిత హర్షం వ్యక్తం చేశారు. ఐటీ పరిశ్రమలు నెలకొల్పే దిశగా మంత్రి కేటీఆర్ యువతను ఎంతగానో ప్రోత్సహిస్తున్నారని కొనియాడారు. హైదరాబాద్ నగరం ఐటీ రంగంలో దేశంలో నంబర్ వన్ గా నిలిచిందన్నారు. కంపెనీ స్థాపించి అనేక మంది యువతకు ఉపాధి కల్పిస్తున్న సాలిగ్రామ్, టెక్ స్మార్ట్ ఐటీ కంపెనీ యాజమాన్యాన్ని ఎమ్మెల్సీ కవిత అభినందించారు.