Breaking News

టీచర్ల బదిలీల్లో అక్రమాలు

టీచర్ల బదిలీల్లో అక్రమాలు
  • సీనియర్లకు కోరుకున్న స్కూళ్లు కేటాయించలేదు
  • స్పౌజ్​ కేటగిరీల్లో అక్రమాలు జరిగాయి
  • విద్యాశాఖలో ఆ ఇద్దరినీ తొలగించండి
  • ఉపాధ్యాయుల అనుమానాలను నివృత్తి చేయండి
  • జిల్లా కలెక్టర్​ కు టీఎస్​ యూటీఎఫ్​ నేతల వినతి

సామాజికసారథి, నాగర్​ కర్నూల్​: దీర్ఘకాలికంగా జిల్లా విద్యాశాఖలో వివిధ హోదాల్లో పనిచేస్తున్న ఏసీఈ రాజశేఖర్​ రావు, డీసీఈబీ సెక్రటరీ సత్యనారాయణరెడ్డి, వెంకటేశ్వర్లు శెట్టిని పరిపాలన అధికారాల నుంచి తొలగించాలని టీఎస్​ యూటీఎఫ్​ నేతలు జిల్లా కలెక్టర్​ బాదావత్​ సంతోష్​ ను కలిసి డిమాండ్​ చేశారు. టీచర్ల బదిలీల్లో స్పౌజ్​ కేటగిరీల్లో అక్రమాలు చోటుచేసుకున్నాయని ఆరోపించారు. గురువారం ఈ మేరకు టీఎస్​ యూటీఎఫ్​ జిల్లా అధ్యక్షుడు ఆర్​.కృష్ణ, ప్రధాన కార్యదర్శి డాక్టర్​ ఎం.శ్రీధర్​ శర్మ, కె.శంకర్​, ఎ.చిన్నయ్య, ఎం.రమాదేవి, జె.బాలరాజు సంయుక్త ప్రకటన విడుదల చేశారు. కౌన్సెలింగ్​ లో ఉద్దేశపూర్వకంగానే కొందరికి ఆశించిన ప్రదేశాలకు బదిలీలు కాలేదని పేర్కొన్నారు. స్కూలు అసిస్టెంట్​ జీవశాస్త్రం విభాగంలో రోస్టర్​ పాయింట్లు పాటించలేదని ఆరోపించారు. ఎస్జీటీ బదిలీల్లో సీనియర్లు కోరుకున్న స్కూళ్లను జూనియర్లకు కేటాయించారని పేర్కొన్నారు. ఎస్​ఏ ఫిజిక్స్​ పోస్టులను ఉద్దేశపూర్వకంగా కొందరికి కేటాయించలేదని తెలిపారు. పదోన్నతుల కేటాయింపులో పారదర్శకత పాటించలేదన్నారు. టీచర్ల సీనియారిటీ జాబితాలో తప్పులను సరిచేయలేదన్నారు. జిల్లా విద్యాశాఖలో నెలకొన్న అనిశ్చితి, అనుమానాలను నివృత్తి చేసి ప్రభుత్వ ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని టీఎస్​ యూటీఎఫ్​ నేతలు కలెక్టర్​ కలెక్టర్​ బాదావత్​ సంతోష్​ ను కోరారు. డీఈవోకు ఎన్నిసార్లు విన్నవించినా సమస్యలు పరిష్కారం కావడం లేదని పేర్కొన్నారు. మీరైనా పరిష్కరించాలని లిఖితపూర్వకంగా విన్నవించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *