సామాజికసారథి, హైదరాబాద్: తెలంగాణలో ఇంటర్మీడియట్ఫలితాలు విడుదలయ్యాయి. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మంగళవారం విడుదల చేశారు. ఇంటర్ ఫస్టియర్లో 63.32 శాతం, సెకండియర్లో 67.82 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు మంత్రి తెలిపారు. పాస్ కాని విద్యార్థులకు ఆగస్టు 1 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ఈ నెల 30వ తేదీ నుంచి సప్లిమెంటరీ ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పించినట్లు పేర్కొన్నారు. ఫలితాల కోసం కింద ఉన్న లింక్ లో చూసుకోవచ్చు.
- June 28, 2022
- Top News
- INTERMEDIATE
- SABITHAINDRAREDDY
- TELANGANA
- ఇంటర్
- తెలంగాణ
- సబితా ఇంద్రారెడ్డి
- Comments Off on flash..flash.. ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల