Breaking News

వ్యవసాయ పరికరాల పరిశీలన

వ్యవసాయ పరికరాల పరిశీలన

సామాజిక సారథి, చిలప్ చెడ్ : ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ రాజేంద్రనగర్ లో వ్యవసాయ పనిముట్లు, యంత్రాలను చిలప్ చెడ్ మండల బృందం పరిశీలించారు. ఈ సందర్భంగా కేవీకే శాస్త్రవేత్త ఉదయ్ కుమార్ మాట్లాడుతూ కృషి విజ్ఞాన కేంద్రం తునికి ఆధ్వర్యంలో చిలప్ చెడ్ మండలానికి సంబంధించిన కొందరు రైతులతో రాజేంద్రనగర్ లోని ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీలో  ఆరుతడి పంటలకు సంబంధించిన పనిముట్లు పరికరాలను పరిశీలించారు. కేవీకే శాస్త్రవేత్త ఉదయ్ కుమార్,  రవి, మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు రాజిరెడ్డి,  జిల్లా రైతు సమన్వయ సమితి సభ్యులు సయ్యద్ హుస్సేన్, రైతులు బాలరాజ్, వెంకట్ రెడ్డి, మాణిక్ ప్రభు, యాదయ్య, చంద్రమోహన్ బృందంలో ఉన్నారు.