అహ్మదాబాద్: ఐదు టీ20 మ్యాచ్ ల సిరీస్లో భాగంగా భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య అహ్మదాబాద్లోని నరేంద్రమోడీ స్టేడియంలో ఆదివారం జరిగిన రెండవ మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో టీమిండియా ఘనవిజయం సాధించింది. తొలి మ్యాచ్లో చేదు అనుభవం ఎదురైనా ఇప్పుడు ఆ ప్రతీకారం తీర్చుకుంది. ఇంగ్లండ్ చేసిన 165 పరుగుల లక్ష్యాన్ని 17.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కెప్టెన్ కోహ్లి (49 బంతుల్లో 73 నాటౌట్; 5×4, 3×6), ఇషాన్ కిషన్ (32 బంతుల్లో 56; 5×4, 4×6) అద్భుతమైన బ్యాటింగ్తో ప్రత్యర్థి జట్టుపై విరుచుకుపడ్డారు. ఓపెనర్కేఎల్రాహుల్నిరాశపరిచారు. మొదటి ఓవర్లోనే పరుగులేవీ చేయకుండానే డకౌట్గా వెనుదిరిగాడు. వికెట్ కీపర్ రిషబ్ పంత్ (13 బంతుల్లో 26; 2×4, 2×6)క్రిస్ జోర్డాన్ బౌలింగ్లో బెయిర్ స్టోకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్బాటపట్టాడు. ఇంగ్లండ్బౌలర్లు శ్యామ్కరణ్, క్రిస్జోర్డన్, రషీద్ఒక్కో వికెట్తీశరు. అంతకుముందు బ్యాటింగ్చేసిన ఇంగ్లండ్ బ్యాట్స్మెన్లలో జోస్ బట్లర్(0), డేవిడ్ మలాన్(24), జేసన్ రాయ్(46), బెయిర్ స్టో (20), మోర్గాన్ (28), స్టోక్స్(24) పరుగులు చేశారు. సామ్ కర్రన్(6), జోర్డాన్(0)లు నాటౌట్ గా మిగిలారు. నిర్ణీత 20 ఓవర్లలో 164/6 చేశారు. టీమిండియా బౌలర్లు భువనేశ్వర్ కుమార్(1/28), చహల్(1/34) తలో వికెట్, సుందర్(2/29), శార్ధూల్ (2/29) చెరో రెండు వికెట్లు తీశారు. ప్లేయర్ఆఫ్ది మ్యాచ్గా ఇషాన్కిషన్ప్రశంసలు అందుకున్నాడు.