Breaking News

పీఆర్సీ హామీ అమలు చేయండి

పీఆర్సీ హామీని అమలు చేయండి

సారథి, బిజినేపల్లి: మండలంలోని వట్టెం గ్రామంలో పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ సాధారణ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్​జిల్లా అధ్యక్షుడు బత్తుల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. పంచాయతీ ఉద్యోగ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పిస్తూ పీఆర్ సీలో చోటు కల్పిస్తున్నామని చెప్పిన హామీలను అమలుచేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దళితబంధు పథకంలో పంచాయతీ కార్మికులను ఆదుకోవాలని కోరారు. కార్యక్రమంలో బిజినేపల్లి మండలాధ్యక్షుడు జిల్లెల రామకృష్ణ, పరుశరాములు, లక్ష్మయ్య, మల్లయ్య, ఎల్లమ్మ పాల్గొన్నారు.