Breaking News

రైలు గేటుపడితే ఇక అంతే

రైలు గేటుపడితే ఇక అంతే
  • రామకృష్ణాపూర్ వాసులకు అవస్థలు
  • సంవత్సరాలు గడుస్తున్న పూర్తికాని ఆర్ఓబీ

సామాజిక సారథి, రామకృష్ణాపూర్: సంవత్సరాలు గడుస్తున్న పూర్తికాని రైల్వే ఫ్లై ఓవర్ బ్రిడ్జి (ఆర్ఓబీ) నిర్మాణ పనులతో రామకృష్ణాపూర్ మున్సిపాలిటీ ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. పట్టణం నుంచి అనేక మంది తమ ఉద్యోగాల కోసం మంచిర్యాలకు వెళ్తుంటారు. ఈ క్రమంలో ఆర్ఓబి పూర్తి కాకపోవడంతో క్యాతన్​ పల్లి రైల్వే గేట్ పడడంతో ఇబ్బందులు పడుతున్నామని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బుధవారం మధ్యాహ్నం 2.30గంటల నుంచి 3 గంటల 30 నిమిషాల వరకు సుమారు ఒక గంట పాటు రైల్వే ట్రాక్ పై గూడ్స్ రైలు నిలిచిపోవడంతో ప్రజలు పడ్డ ఇబ్బందులు అన్నీ..ఇన్నీ కావు. రైల్వే గేట్ వద్ద మంచిర్యాల నుంచి ఆర్కేపీ..ఆర్కేపీ నుంచి మంచిర్యాలకు వెళ్లాల్సిన ప్రయాణికులు తమ గమ్య స్థానాలకు చేరుకోవాలంటే తమ ప్రాణాలను అర చేతిలో పెట్టుకొని ట్రాక్ పై నిలిచి ఉన్న ట్రైన్ కింద నుంచి వెళ్లారు. అత్యవసర పరిస్థితులలో ఈ మార్గం గుండా అంబులెన్స్ ల్లో ఆసుపత్రులకు వెళ్లాల్సిన సమయంలో ప్రాణాలను సైతం కోల్పోయిన పరిస్థితులు లేకపోలేదు. ఇప్పటికైనా నియోజవర్గ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ స్పందించి చేపడుతున్న ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులను పూర్తిచేయాలని స్థానికులు డిమాండ్​ చేస్తున్నారు.