Breaking News

విద్యా సంస్థలకు సెలవు రద్దు చేయాలి

విద్యా సంస్థలకు సెలవు రద్దు చేయాలి
  • ట్రస్మా రాష్ట్ర అధ్యక్షులు యాదగిరి శేఖర్ రావు

సామాజిక సారథి, సిద్దిపేట: విద్యా సంస్థలకు ప్రభుత్వం సెలవులను వెంటనే రద్దు చేయాలని తెలంగాణ ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యం (ట్రస్మా) రాష్ట్ర అధ్యక్షులు యాదగిరి శేఖర్ రావు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలు కొవిడ్ నిబంధనలు పాటిస్తూ, విద్యార్థులకు విద్యనందిస్తున్నాయన్నారు. సంక్రాంతి పండుగ సెలవుల పేరుతో పాఠశాలకు ప్రభుత్వం ముందుగానే సెలవులు ప్రకటించిందని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా కరోనా నిబంధనలకు విరుద్దంగా షాపింగ్ మాల్స్, వైన్స్, బార్లు, క్లబ్బులు, మార్కెట్స్, సినిమా థియేటర్లు, పార్కులు, రాజకీయ నాయకుల మీటింగ్స్ కరోనా విజృంభణకు కేంద్రాలుగా మారుతున్నాయని ఆరోపించారు. ఓవైపు ప్రభుత్వం ఇస్తున్న సూచనలు తూచతప్పకుండా పాటిస్తూనే, మరోవైపు విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పిస్తున్న ప్రైవేట్ స్కూళ్లపై ప్రభుత్వ సెలవులు ప్రకటించడం పట్ల తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఈనెల 30వరకు పొడిగించిన సెలవులను రద్దు చేసి, నష్టాల్లో ఉన్న ప్రైవేట్ పాఠశాలను ఆదుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో (ట్రాస్మా) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాదుల మధుసూదన్, రాష్ట్ర కోశాధికారి ఐవి. రమణరావు, (ట్రస్మా) యాజమాన్య కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.