Breaking News

ఇంటి నిర్మాణానికి చేయూత

ఇంటి నిర్మాణానికి చేయూత

సారథి, రామయంపేట: గృహ నిర్మాణం కోసం ఇచ్చిన మాట నిలబెట్టుకుని మరోసారి తన ఔదార్యాన్ని చాటుకున్నారు నిజాంపేట మండల జడ్పీటీసీ పంజా విజయ్ కుమార్. మండల పరిధిలోని నందగోకుల్ గ్రామానికి చెందిన కొమ్మట స్వామి నివాసం ఉంటున్న పూరి గుడిసె కూలిపోవడంతో బాధితుడి ఆర్థిక పరిస్థితి బాగులేనందున స్థానిక సర్పంచ్ బుర్ర బాల్ నర్సవ్వ ఇంటి నిర్మాణానికి సహాయం అందించాలని కోరారు. వెంటనే బాధితుడి ఇంటికి వెళ్లి పరిశీలించి నిర్మాణానికి సాయం చేస్తానని హామీఇచ్చారు. ఈ మేరకు శనివారం 30 బస్తాలు సిమెంటును అందజేసి నిలబెట్టుకున్నారు. ఆయన సేవలను పలువురు కొనియాడారు. పలువురు జడ్పీటీసీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో టీఆర్​ఎస్​ నాయకులు సంతోష్ గౌడ్, జీపీ స్వామి, గర్గుల శ్రీనివాస్, అబ్దుల్ పాషా పాల్గొన్నారు.