Breaking News

ఆస్పత్రుల్లో వైద్యం కరువు

– కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలి

సారథి, సిద్దిపేట ప్రతినిధి: కరోనా వైరస్ ను ఆరోగ్యశ్రీలో చేర్చాలని యువజన కాంగ్రెస్ పార్టీ హుస్నాబాద్ నియోజకవర్గ అధ్యక్షులు బీనవేని రాకేష్ అన్నారు. ఈ సందర్భంగా బుధవారం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వాస్పత్రుల్లో సరైన సౌకర్యలు లేక వైద్యమందక ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయిస్తే పేద ప్రజలు ఆర్థిక ఇబ్బందులతో ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. మండల గ్రామీణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రతి రోజుకు 30 కరోనా టెస్టులు మాత్రమే చేయ్యడంతో రోగులు అవస్థలు పడుతున్న పాలకులు పట్టించుకున్న పాపానపోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైన రాష్ట్ర ప్రభుత్వం కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని లేనిపక్షంలో కాంగ్రెస్ పార్టీ పక్షాన పెద్దఎత్తన ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు.