![బతుకుదెరువు కోసమొస్తే ఊపిరి ఆగింది](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2021/06/crime.jpg?fit=655%2C446&ssl=1)
సారథి, పెద్దశంకరంపేట: బతుకుదెరువు కోసం కర్నూలు జిల్లా డోన్నుంచి వచ్చిన ఓ వ్యక్తి గుండెపోటుతో మృతిచెందాడు. ఈ ఘటన మెదక్జిల్లా పెద్దశంకరంపేటలో బుధవారం జరిగింది. ఎస్సై నరేందర్ కథనం.. డోన్కు చెందిన దూదేకుల షేక్ షావలీ(45) పొట్టకూటి కోసం పెద్దశంకరంపేట్ వచ్చి తాపీమేస్త్రి పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఉదయం ఛాతీలో నొప్పి రావడంతో తోటికార్మికుడు జయరాములు ఆస్పత్రికి తీసుకువెళ్తున్న సమయంలో మెదక్ రోడ్డులో పక్కనే కుప్పకూలిపోయాడు.. సంగారెడ్డిలో ఉంటున్న అతని సోదరుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.