Breaking News

పేదలందరికీ ప్రభుత్వ పథకాలు

పేదలందరికీ ప్రభుత్వ పథకాలు

సారథి, పెద్దశంకరంపేట: అర్హులైన పేదలందరికీ ప్రభుత్వ పథకాలు అందాలని నారాయణఖేడ్​ఎమ్మెల్యే భూపాల్​రెడ్డి ఆకాంక్షించారు. బుధవారం ఆయన మెదక్​జిల్లా పెద్దశంకరంపేట మండల కేంద్రంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో కొత్తగా మంజూరైన 161 రేషన్​కార్డులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేదలు ఆకలి బాధ ఎదుర్కొవద్దనే ఉద్దేశంతో నూతనంగా రేషన్​ కార్డులను అందజేస్తున్నారని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని కొనియాడారు. ఈ ప్రాంతంలో 35వేల ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యులు విజయరామరాజు, వైస్​ఎంపీపీ లక్ష్మీరమేష్, రైతుబంధు అధ్యక్షుడు సురేష్​గౌడ్, పెద్దశంకరంపేట సర్పంచ్​అలుగుల సత్యనారాయణ, సర్పంచ్​ల ఫోరం అధ్యక్షుడు కుంబ్ల రాములు, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు దత్తు, ఆయా గ్రామాల సర్పంచ్​లు, ఎంపీటీసీ సభ్యులు, నాయకులు వేణుగోపాల్​గౌడ్, మాణిక్​రెడ్డి, తహసీల్దార్​ చరణ్​సింగ్, ఆర్ఐ ప్రభాకర్ ​తదితరులు పాల్గొన్నారు.