Breaking News

వరిధాన్యం కొనుగోళ్లపై దోబూచులాట

ఆ పార్టీ నేతల వినతి

సామాజిక సారథి, ములుగు: జిల్లా వ్యాప్తంగా వరి ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని, బస్తాలు, లారీల కొరత లేకుండా వర్షానికి తడవకుండా పట్టాలు అందుబాటులో ఉంచాలని రైతు సంఘం ములుగు జిల్లా కమిటీ అడిషనల్ కలెక్టర్ కు వినతి పత్రం అంతించారు. ఈ సందర్భంగా తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఎండి గపూర్  మాట్లాడుతూ వరి కోతలు ప్రారంభమై నెల రోజులు దాటుతున్నా, ఇప్పటివరకూ ధాన్యం కొనుగోలు చేయలేదని ఆరోపించారు. కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం నాయకులు కంటెం సత్యం, తోట నాగేశ్వరరావు వాంకుడోత్ సమ్మయ్య, తదితరులు పాల్గొన్నారు.