Breaking News

పోరాటమే సమస్యలకు పరిష్కారం

పోరాటమే సమస్యలకు పరిష్కారం

సామాజిక సారథి డిండి:  ప్రజా పోరాటాలతోనే సమస్యలు పరిష్కారం అవుతాయని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నర్సింహారెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని తిరుమలాపురంలో సీపీఐ నూతన జెండా ఆవిష్కరణతో పాటు జోగు బజార్ 12 వ వర్ధంతి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పార్టీ శ్రేణులు బజార్ స్తూపానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించి ఆయన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా రైతు సంఘం అధ్యక్షుడు ఎండి మైన్ఉద్దీన్, సీపీఐ మండల కార్యదర్శి పోలే వెంకటయ్య, సీపీఐ  జిల్లా నాయకులు యుగంధర్ రావు, మండల సహాయ కార్యదర్శి ఆరెకంటి రాధాకృష్ణ, మండల కమిటీ సభ్యులు వింజమూరు నరసింహ, వేముల బుచ్చయ్య, తిరుమలాపురం గ్రామ శాఖ కార్యదర్శి జోగు శ్రీరాములు, శ్రీను, లక్ష్మయ్య, వెంకటయ్య, మహేందర్, రాజు, శంకరయ్య, రాములు, నరసింహ, సైదులు, కృష్ణయ్య, చంద్రయ్య, రామస్వామి, తదితరులు పాల్గొన్నారు.