![ఈఎంఐలు కడుతున్నారా.. కొంత ఊరట!](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2021/05/emi.jpg?fit=655%2C350&ssl=1)
న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తోంది. కొవిడ్ 19 దెబ్బకు రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్, కర్ఫ్యూల వైపు అడుగులు వేస్తున్నాయి. ప్రైవేట్ ఉద్యోగులు, వ్యాపారులపై తీవ్ర ప్రభావం చూపాయి. చాలా మంది ఉపాధి లేక రోడ్డునపడుతున్నారు. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో బ్యాంకులు రుణ గ్రహీతలకు ఊరట కలిగించే నిర్ణయం తీసుకోనున్నాయి. లోన్ ఈఎంఐ చెల్లింపుల పట్ల కొంత గడువు ఇచ్చే విషయాన్ని ఆర్బీఐకి ఆయా బ్యాంకులు తెలియజేశాయి. లోన్లు తీసుకున్నవారికి మరో మూడునెలల పాటు మారటోరియం సౌకర్యాన్ని మళ్లీ అందుబాటులోకి తీసుకొస్తే బాగుంటుందని కోరాయి. లేదంటే రుణ ఎగవేతలు పెరిగే అవకాశం ఉందని, దీంతో మొండి బకాయిలు బకాయిలు పెరిగిపోతాయని ఆందోళన వ్యక్తంచేశారు. ఈ విషయం ఆర్బీఐ పరిశీలనలో ఉంది. కాగా, ఆర్బీఐ గతేడాది ఆరు నెలల పాటు మారటోరియం ప్రకటించిన విషయం తెలిసిందే.