![అంబేద్కర్ ఉత్సవ కమిటీ ఎన్నిక](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2021/04/rmgd.jpeg?fit=655%2C294&ssl=1)
సారథి, రామడుగు: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవ కమిటీని బుధవారం మండల కేంద్రంలో ఆర్యవైశ్య ఫంక్షన్ హాల్లో జరిగిన సమావేశంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కమిటీ చైర్మన్ గా కాడే శంకర్, వైస్ చైర్మన్ గా జెట్టుపల్లి వీరయ్య, మాదం ఎల్లయ్య, మాదం రమేష్, గునుగొండ అశోక్, ప్రధాన కార్యదర్శిగా జెట్టుపల్లి మురళి, కోశాధికారి పల్నాటి చంద్రయ్య సభాధ్యక్షుడిగా జెట్టుపల్లి అనిల్, సభ్యులు పర్లపల్లి మహేష్ కర్నె శ్రీను, సలహాదారులుగా కల్గెటి లక్ష్మణ్, వెన్న రాజమల్లయ్య ఎన్నికయ్యారు. అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేస్తామని కమిటీ సభ్యులు తెలిపారు.