Breaking News

భక్త మార్కండేయ దేవాలయానికి విరాళం

భక్త మార్కండేయ దేవాలయానికి విరాళం

సామాజిక సారథి, ఆమనగల్లు: ఆమనగల్లు శ్రీ భక్త మార్కండేయ దేవాలయంలో గదినిర్మాణానికి రిటైర్డ్ ఉద్యోగి ఏలే యాదగిరి నర్మదమ్మ దంపతులు, వారి కుమారుడు శివప్రసాద్, విజయలక్ష్మి దంపతులు రూ.1.20 లక్షల విరాళం ఇచ్చారు. దేవాలయంలోని గది నిర్మాణానికి భారీగా విరాళం ఇవ్వడం పట్ల పద్మశాలి సంఘం మండలాధ్యక్షులు ఎంగిలి బాలకృష్ణయ్య, సంఘ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ వైస్ చైర్మన్ భీమనపల్లి దుర్గయ్య, ఉపాధ్యక్షులు అప్పం శ్రీను, కార్యదర్శి అవ్వారి శివలింగం, కోశాధికారి గాజుల సత్యం, రాములు, యువజన సంఘం అధ్యక్షులు మామిడిశెట్టి రవి, కార్యదర్శి పున్న వెంకటేష్, కోశాధికారి చెరుకు రవి, కుల బంధువులు మస్న గిరి. పున్న శ్రీను, సిరందాస్ జగదీష్, చెరుకు యాదగిరి, సత్యం తదితరులు పాల్గొన్నారు.