Breaking News

తీన్మార్ మల్లన్న పొలిటికల్ జోకర్

తీన్మార్ మల్లన్న పొలిటికల్ జోకర్

సామాజికసారథి, ఖమ్మం: తీన్మార్ మల్లన్న పెట్టే రాజకీయ పార్టీపై స్పందించిన బీఎస్పీ రాష్ట్ర చీఫ్​కోఆర్డినేటర్​డాక్టర్​ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.. మల్లన్న లాంటి పొలిటికల్ జోకర్​పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. సోమవారం బహుజన రాజ్యాధికార యాత్రలో భాగంగా సోమవారం ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం అన్నారుగూడెంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ముస్లింలకు 12శాతం రిజర్వేషన్లు పెంచుతామని హామీ ఇచ్చిన కేసీఆర్ ఏడేళ్లుగా రిజర్వేషన్లు ఎందుకు పెంచలేదని ప్రశ్నించారు. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న వేలకోట్ల వక్ఫ్ బోర్డు భూములను బలవంతంగా ప్రభుత్వం గుంజుకుంటోందని ఆరోపించారు. అగ్రిగోల్డ్‌ బాధితులు న్యాయం చేయాలని అనేక రకాలుగా ఆందోళనలు చేసినా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దురదృష్టకరమన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి అగ్రిగోల్డ్‌ సంస్థ ఆస్తులను వేలం వేసి బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. దళితబంధు లబ్ధిదారుల ఎంపికలో ఎమ్మెల్యేలు కమీషన్లు తీసుకుని తమ అనుచరులు, బంధువులను ఎంపిక చేస్తున్నారని ఆరోపించారు. తదనంతరం తల్లాడలో ఏర్పాటు ఇఫ్తార్ లో డాక్టర్​ ఆర్ఎస్ ​ప్రవీణ్​కుమార్​పాల్గొన్నారు. పినపాక, రెడ్డిగూడెం, గొల్లగూడెం, మల్లారం మీదుగా బహుజన రాజ్యాధికార యాత్ర కొనసాగింది.