Breaking News

నిర్వాసితులకు న్యాయం చేయండి

నిర్వాసితులకు న్యాయం చేయండి

సారథి, రామడుగు: మండలంలోని దేశరాజుపల్లి గ్రామానికి చెందిన కొత్తపల్లి ‌‌–మనోహరాబాద్ రైల్వే లైన్ భూ బాధితులకు న్యాయం చేయాలని ఆ గ్రామ ఎంపీటీసీ సభ్యుడు వంచ మహేందర్ రెడ్డి గ్రామ భునిర్వాసితులతో కలసి చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్​ను క్యాంపు కార్యాలయంలో శనివారం కలిసి వినతిపత్రం అందజేశారు. గతంలో పెద్దపల్లి –నిజామాబాద్ రైల్వే లైన్ లో భూములు, ఇండ్లను కోల్పోయి ఆ రైల్వే లైన్ పక్కనే భూమి కొనుగోలుచేసి నివాస గృహాలను ఏర్పాటు చేసుకున్నారని తెలిపారు. మళ్లీ మనోహరాబాద్ రైల్వే జంక్షన్ లో భూములు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. భూములు కోల్పోతున్న వారికి మార్కెట్ విలువ ప్రకారం నష్టపరిహారం చెల్లించి డబుల్ బెడ్ రూమ్​ ఇళ్లు కట్టించి ఆదుకోవాలని డిమాండ్​ చేశారు. వినతిపత్రం అందజేసిన వారిలో ఎంపీటీసీ వంచ మహేందర్ రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఎల్కపెల్లి లచ్చయ్య, కొమురయ్య, నిర్వాసితులు పాల్గొన్నారు.