![గ్రామస్తులకు మొక్కల పంపిణీ](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2021/07/gply.jpg?fit=655%2C325&ssl=1)
సారథి, గొల్లపల్లి: జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం వెంగళపూర్ గ్రామంలో పల్లెప్రగతి 4వ విడత, 7వ విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా సర్పంచ్ గుండ రమ్య పలు రకాల పూలజాతుల మొక్కలను పంపిణీచేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రతి ఇంటికీ ఇస్తున్న ఆరు మొక్కలను పెంచి సంరక్షించాలని సూచించారు. కార్యక్రమంలో స్పెషలాఫీసర్, ఏపీఎం త్రివేణి, టీఆర్ఎస్ నాయకులు, మాజీ ఉపసర్పంచ్ గుండ గంగయ్య, సీఏ గాయత్రి, బి.శేఖర్, పి.హరీశ్,గ్రామస్తులు పాల్గొన్నారు.