Breaking News

కరోనా బాధితులకు సరుకులు పంపిణీ

కరోనా బాధితులకు సరుకులు పంపిణీ

సారథి, రామయంపేట: మెదక్ జిల్లా నిజాంపేట మండలంలోని కల్వకుంట గ్రామానికి చెందిన కొంతమంది కరోనా బాధితులకు మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి ఆదేశాల మేరకు 15 రోజుల పాటు వారికి నిత్యవసర సరుకులను కల్వకుంట సహకార సంఘం చైర్మన్​ అందె కొండల్ రెడ్డి అందంజేశారు. ఈ మేరకు ఆయన బాధితులకు మనోధైర్యాన్ని నింపి, వారికి ఏ సమస్య ఉన్నా తనకు తెలియజేయాలని కోరారు. పంపిణీలో మండల మాజీ మార్కెట్ డైరెక్టర్ నాగరాజు, రజక సంఘం జిల్లా అధ్యక్షుడు సంగు స్వామి, మాజీ కో ఆప్షన్ సభ్యుడు అబ్దుల్ అజీజ్, సీనియర్ నాయకులు లచ్చపేట్ రామగౌడ్, కల్వకుంట గ్రామ టీఆర్​ఎస్​వీ ఉపాధ్యక్షుడు రాము, కార్తీక్ పాల్గొన్నారు.