Breaking News

అభివృద్ధి పనులు ఇగ ఆగొద్దు

అభివృద్ధి పనులు ఇగ ఆగొద్దు

సారథి, పెద్దశంకరంపేట: పెద్దశంకరంపేట మండలంలో కొనసాగుతున్న పలు అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని మెదక్ జిల్లా జడ్పీ సీఈవో వెంకట శైలేష్ అధికారులకు సూచించారు. బుధవారం పెద్దశంకరంపేట మండలం కమలాపూర్, మాడ్ శెట్ పల్లి గ్రామాల్లో వైకుంఠధామం తదితర అభివృద్ధి పనులను ఆయన స్వయంగా పరిశీలించారు. వీలైనంత తొందరగా వైకుంఠధామం పనులు, కంపోస్టు ఎరువుల తయారీ తదితర పనులను పూర్తిచేయాలని కోరారు. పల్లెప్రగతిలో భాగంగా ప్రతి గ్రామంలో ఎక్కువ సంఖ్యలో మొక్కలు నాటాలని, వాటిని సంరక్షించుకునేందుకు ప్రతిఒక్కరూ పాటుపడాలని సూచించారు. ఆయన వెంట పెద్దశంకరంపేట ఎంపీపీ జంగం శ్రీనివాస్, ఎంపీడీవో రాంనారాయణ, ఏపీవో సుధాకర్ తదితరులు ఉన్నారు.