Breaking News

పాలెం ప్రాజెక్టులో యువకుడి డెడ్​బాడీ

పాలెం ప్రాజెక్టులో యువకుడి డెడ్​బాడీ

సారథి న్యూస్, వెంకటాపురం: నాలుగు రోజుల క్రితం అదృశ్యమైన ములుగు జిల్లా నూగురు వెంకటాపురం మండల కేంద్రంలోని కుమ్మరివీధికి చెందిన పూసం యశ్వంత్(20) అనే యువకుడి డెడ్​బాడీ గురువారం పాలెం ప్రాజెక్టులో లభ్యమైంది. గ్రామస్తుల కథనం మేరకు.. పూసం యశ్వంత్ నాలుగు రోజుల క్రితం ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బయటకు వెళ్లాడు. ఆ సమయంలో ఇంట్లో వారంతా వేరే బంధువుల ఇంటికి వెళ్లి ఉండొచ్చని భావించి ఆరా తీయలేదు. రెండురోజులైనా ఇంటికి తిరిగి రాకపోవడంతో ఇంటి సభ్యులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే పూసం యస్వంత్ మృతదేహం పాలెం ప్రాజెక్టులో దొరికింది. ఈ ఘటనపై వెంకటాపురం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.