Breaking News

ములుగు ఎస్పీకి కరోనా వ్యాక్సిన్​

ములుగు ఎస్పీకి కరోనా వ్యాక్సిన్​

సారథి న్యూస్, వాజేడు: ములుగు జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జి.పాటిల్ గురువారం ములుగు జిల్లా ఏరియా ఆస్పత్రిలో కరోనా వ్యాక్సిన్ ​తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా వైరస్ వ్యాప్తి సమయంలో జిల్లా పోలీస్ సిబ్బంది వెనకడుగు వేయకుండా తమ కుటుంబాలకు దూరంగా ఉంటూ సేవలు అందించారని కొనియాడారు. మనదేశంలో తయారైన వ్యాక్సిన్ అత్యంత సురక్షితమైందని వివరించారు. భారత శాస్త్రవేత్తలు, డాక్టర్లు తయారుచేసిన వ్యాక్సిన్ ​ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. కరోనా వ్యాక్సిన్ తీసుకున్న పోలీస్ సిబ్బందికి ఆరోగ్యపరంగా ఎలాంటి సమస్యలు లేవని స్పష్టం చేశారు. వ్యాక్సిన్ వేయించుకున్నప్పటికీ తప్పనిసరిగా మాస్కులు కట్టుకోవాలని, చేతులు శుభ్రంగా కడుక్కోవాలని ప్రజలను కోరారు. కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి అప్పయ్య, ఎస్​బీ ఇన్​స్పెక్టర్, రెహమాన్, ములుగు ఎస్సై హరికృష్ణ పాల్గొన్నారు.