Breaking News

కరోనా సెకండ్​ వేవ్​.. మీటింగ్​లకు నో పర్మిషన్​

కరోనా సెకండ్​ వేవ్​.. మీటింగ్​లకు నో పర్మిషన్​

సారథి, రామడుగు: కొద్దిరోజులుగా కరోనా మహమ్మరి సెకండ్ వేవ్ ఉధృతి పెరిగిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వం ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని కొన్ని నిషేధాజ్ఞలు జారీచేసిందని, వాటిని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని రామడుగు ఎస్సై గొల్లపల్లి అనూష హెచ్చరించారు. ఈ మేరకు ఆమె ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వం ఆదేశాలను మండల ప్రజలు కచ్చితంగా పాటించాలని సూచించారు.

బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించాలని, సభలు, సమావేశాలకు అనుమతి లేదని, ర్యాలీలు, ధర్నాలకు పర్మిషన్​ లేదని హెచ్చరించారు. వరుసగా వచ్చే పండుగలను ప్రజలు గుమికూడకుండా జరుపుకోవాలని సూచించారు. నిబంధనలను ఎవరు ఉల్లంఘించినా వారిపై డిజాస్టర్ మేనేజ్​మెంట్​యాక్టు ప్రకారం చర్యలు తీసుకుంటామని ఎస్సై అనూష హెచ్చరించారు.