![కరోనా సెకండ్ వేవ్.. మీటింగ్లకు నో పర్మిషన్](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2021/03/carona-1f.jpg?fit=655%2C300&ssl=1)
సారథి, రామడుగు: కొద్దిరోజులుగా కరోనా మహమ్మరి సెకండ్ వేవ్ ఉధృతి పెరిగిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వం ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని కొన్ని నిషేధాజ్ఞలు జారీచేసిందని, వాటిని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని రామడుగు ఎస్సై గొల్లపల్లి అనూష హెచ్చరించారు. ఈ మేరకు ఆమె ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వం ఆదేశాలను మండల ప్రజలు కచ్చితంగా పాటించాలని సూచించారు.
బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించాలని, సభలు, సమావేశాలకు అనుమతి లేదని, ర్యాలీలు, ధర్నాలకు పర్మిషన్ లేదని హెచ్చరించారు. వరుసగా వచ్చే పండుగలను ప్రజలు గుమికూడకుండా జరుపుకోవాలని సూచించారు. నిబంధనలను ఎవరు ఉల్లంఘించినా వారిపై డిజాస్టర్ మేనేజ్మెంట్యాక్టు ప్రకారం చర్యలు తీసుకుంటామని ఎస్సై అనూష హెచ్చరించారు.
![](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2021/03/si-ramadugu-f.jpg?resize=249%2C206&ssl=1)