Breaking News

ప్రజా ప్రతినిధులకు కరోనా..

ప్రజా ప్రతినిధులకు కరోనా..
  • స్పీకర్​పోచారం, సీఎల్పీ నేత భట్టి, ఎమ్మెల్యే ముత్తిరెడ్డిలకు కరోనా పాజిటివ్​

సామాజిక సారథి, హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనా ఉధృతి రోజురోజుకు తీవ్రమవుతోంది. కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. తాజాగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్కకు కరోనా సోకింది. ప్రస్తుతం ఆయన హోం ఐసొలేషన్‌లో ఉన్నారు. స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డికి కరోనాతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. శనివారం కరోనా లక్షణాలు కనిపించడంతో టెస్టు చేయించుకోగా కరోనా పాటిజివ్‌గా నమోదైనట్లు వైద్యులు తెలిపారు. ఎటువంటి సమస్యలు లేనప్పటికీ వైద్యుల సూచనల మేరకు హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చేరినట్లు వైద్యులు తెలిపారు. మరోవైపు ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి కరోనా సోకింది. దీంతో ఆయన హోం ఐసొలేషన్‌లో ఉన్నారు. ఇటీవల తనతో సన్నిహితంగా ఉన్నవారు కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. కరోనా మొదటి వేవ్‌లో ముత్తిరెడ్డి కరోనా బారినపడ్డారు. అప్పట్లో రాష్ట్రంలో కరోనా సోకిన తొలి ఎమ్మెల్యే  ముత్తిరెడ్డి కావడం గమనార్హం.

One thought on “ప్రజా ప్రతినిధులకు కరోనా..”

Comments are closed.