Breaking News

భద్రాద్రిలో కరోనా ఎఫెక్ట్‌

భద్రాద్రిలో కరోనా ఎఫెక్ట్‌
  • వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు రద్దు

సామాజికసారథి, భద్రాచలం: రోజురోజుకూ పెరుగుతున్న కరోనా కేసుల ప్రభావం భద్రాచలం సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంపై పడింది. ప్రభుత్వ హెచ్చరికల నేపథ్యంలో సోమవారం నుంచి ఈనెల 10వ తేదీ వరకు జరగాల్సిన వైకుంఠ ఏకాదశి ఉత్సవాలను రద్దుచేశారు. అలాగే స్వామి వారి తిరువీధి సేవలు, సాంస్కృతిక కార్యక్రమాలు కూడా రద్దు చేసినట్లు దేవస్థానం ఈవో బి.శివాజీ ఒక ప్రకటనలో తెలిపారు. దేవస్థానంలో సేవల పునరుద్ధరణ గురించి కరోనా ప్రభావం ముగిశాక ప్రకటిస్తామని ఆయన తెలిపారు. భక్తులు సేవల రద్దు విషయంలో సహకరించాలని.. కరోనా మహమ్మారి

సామాజిక వ్యాప్తిని నివారించాలని ఆయన కోరారు.