Breaking News

ముగిసిన వాసవి జిల్లా ప్రాంతీయ సమావేశాలు

ముగిసిన వాసవి జిల్లా ప్రాంతీయ సమావేశాలు

సామాజిక సారథి, మందమర్రి (మంచిర్యాల): వాసవి ప్రాంతీయ సమావేశాలు బెల్లంపల్లి పట్టణంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో ఆదివారం దిగ్విజయంగా ముగిసాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా మంచిర్యాల జిల్లా వాసవి క్లబ్ గవర్నర్ పాల్గొని మంచిర్యాల జిల్లాలోని 5 రీజియన్లలో క్లబ్ సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్న వారిని గుర్తించి అవార్డులు అందజేశారు. ఈ సందర్భంగా వాసవి వనిత క్లబ్ అధ్యక్షురాలు తమ్మిశెట్టి మంజుల మాట్లాడుతూ ప్రతి ఒక్కరు సేవ దృక్పథంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం నాయకులు, వాసవి, వనిత క్లబ్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.