Breaking News

మునుగోడులో బీఎస్పీ గెలుపు ఖాయం

మునుగోడులో బీఎస్పీ గెలుపు ఖాయం
  • బీఎస్పీ నేత ఏర్పుల సాయికృష్ణ

 సామాజిక సారథి, సూర్యాపేట: మునుగోడు ఉప ఎన్నికల్లో బీఎస్పీ అభ్యర్థి శంకరచారి గెలుపు ఖాయమని బిఎస్పీ నాయకులు ఏర్పుల సాయికృష్ణ అన్నారు. మంగళవారం ఉప ఎన్నికల సందర్భంగా ఇంటింటా ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  తెలంగాణ రాష్ట్రం మునుగోడు ఉప ఎన్నికల్లో ప్రధాన రాజకీయ పార్టీలు ఆధిపత్య వర్గానికి చెందిన నాయకులకే టికెట్లు కేటాయించాయని ఆరోపించారు. బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర చీఫ్ డాక్టర్ ఆర్ఎస్. ప్రవీణ్ కుమార్ మాత్రం బీసీ బిడ్డకు టికెట్ ఇచ్చి ఎన్నికల బరిలో నిలిపారని చెప్పారు. బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల అభ్యర్థులు ప్రజలను నిలువుదోపిడి చేసేందుకే బరిలో ఉన్నారని మండిపడ్డారు. బహుహన్ సమాజ్ పార్టీ అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని బీఎస్పీ నేతలు, కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి ప్రజలను చైతన్యం చేస్తున్నారని చెప్పారు.