Breaking News

ఆ రెండు గురుకులాలను వెనక్కి తీసుకురండి

ఆ రెండు గురుకులాలను వెనక్కి తీసుకురండి

సారథి న్యూస్, బిజినేపల్లి: స్థానికంగా సరైన వసతులు లేవనే కారణంతో వనపర్తి, షాద్​నగర్ లో కొనసాగుతున్న బిజినేపల్లి సాంఘిక సంక్షేమశాఖ గురుకుల బాలుర పాఠశాల, నాగర్ కర్నూల్ మహిళా గురుకుల డిగ్రీ కాలేజీని ఇదివరకు ఉన్న ప్రదేశాల్లోనే కొనసాగించాలని సీఎం కె.చంద్రశేఖర్​రావు గురుకులాల కార్యదర్శి డాక్టర్​ ఆర్ఎస్​ ప్రవీణ్​కుమార్​ను కోరారు. ఈ మేరకు సోమవారం సీఎంవో సెక్రటరీ కె.భూపాల్​రెడ్డి ఉత్తర్వులు జారీచేశారు. విద్యార్థులకు సరిపడా గదులు, వసతి సౌకర్యం లేదని గతేడాది బిజినేపల్లి స్కూలును వనపర్తికి, నాగర్​కర్నూల్ ​మహిళా డిగ్రీ కాలేజీని షాద్​నగర్​కు తరలించారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పడుతున్న ఇబ్బందులను నాగర్​కర్నూల్​ ఎమ్మెల్యే మర్రి జనార్దన్​రెడ్డి పలుమార్లు సీఎం కేసీఆర్​ దృష్టికి తీసుకెళ్లారు. సానుకూలంగా స్పందించిన సీఎం ఆ రెండు విద్యాసంస్థలను వెంటనే వెనక్కి తీసుకెళ్లాలని సూచించారు. స్థానిక ఎమ్మెల్యే మర్రి జనార్దన్​రెడ్డి తీసుకున్న చొరవ పట్ల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కృతజ్క్షతలు తెలిపారు. పేరెంట్స్​అసోసియేషన్​రాష్ట్ర కమిటీ సభ్యుడు మొల్గర మహేందర్, జిల్లా కార్యదర్శి ఎల్.వెంకట్, ఎంపీపీ శ్రీనివాస్​గౌడ్​తదితరులు అభినందనలు తెలిపారు.

సీఎంవో సెక్రటరీ కె.భూపాల్​రెడ్డి జారీచేసిన ఉత్తర్వులు