Breaking News

రైతుల కోసం బీజేపీ దీక్ష

రైతుల కోసం బీజేపీ దీక్ష

సారథి, వేములవాడ: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎంపీ బండి సంజయ్ ఆదేశాల మేరకు ఆ పార్టీ రాజన్న సిరిసిల్ల అధ్యక్షుడు ప్రతాపరామకృష్ణ ఆధ్వర్యంలో సోమవారం వేములవాడలో రైతుగోస తెలంగాణ పోరు దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లడుతూ.. సీఎం కేసీఆర్ రైతులను దోచుకుంటున్నారని ఆరోపించారు. ఇసుక విషయంలో మనుషులను చంపి నడిపించే లారీలు అందుబాటులో ఉన్నాయని, రైతులు వరి ధాన్యం అమ్ముకుందామంటే లారీలను సమకూర్చలేని పరిస్థితుల్లో ప్రభుత్వం ఉందన్నారు. కొనుగోలు సెంటర్లలో వరి ధాన్యాన్ని తొందరగా కొనాలని డిమాండ్ చేశారు. రైతురుణ మాఫీ, రైతుబంధు ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో 20వ వార్డు కౌన్సిలర్, పార్టీ అధ్యక్షుడు రంగుల సంతోష్ బాబు తదితరులు పాల్గొన్నారు.