Breaking News

బీజేవైఎం ఆధ్వర్యంలో భిక్షాటన

బీజేవైఎం ఆధ్వర్యంలో భిక్షాటన

సారథి, చొప్పదండి: భారతీయ జనతా యువమోర్చా రాష్ట్ర శాఖ, జిల్లా శాఖ పిలుపుమేరకు చొప్పదండి మండల శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం కొలిమికుంట గ్రామంలో భిక్షాటన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేవైఎం మండలాధ్యక్షుడు మొగిలి మహేష్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో భర్తీచేయాల్సిన రెండు లక్షల ఉద్యోగాలను వెంటనే నింపాలని డిమాండ్​ చేశారు. సీఎం కేసీఆర్ ప్రకటించినట్లు రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి చెల్లించాలని కోరారు. కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు గుర్రం సమరసింహరెడ్డి, కొలిమికుంట ఎంపీటీసీ తోట కోటేశ్​పటేల్, బీజేవైఎం ప్రధాన కార్యదర్శి సాయికృష్ణ, ఉపాధ్యక్షుడు దాడి సురేష్, రవి, నార్ల ఆదిత్య, దాసరి వంశీ, రాజు కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.