Breaking News

నేలలపై అవగాహన

నేలలపై అవగాహన

సామాజిక సారథి, నార్కెట్ పల్లి: ప్రపంచ నేల దినోత్సవం సందర్భంగా నల్లగొండ జిల్లా దేశ్ పాండే ఫౌండేషన్ సంస్థల సభ్యులు నార్కట్ పల్లి మండలం మాండ్ర గ్రామంలోని రైతులకు నేలలపై అవగాహన కల్పించారు. వ్యవసాయ సూర్యాపేట రాష్ట్రీయ కెమికల్ అండ్ ఫెర్టిలైజర్ భారత ప్రభుత్వ రంగ సంస్థ, దేశ్పాండే ఫౌండేషన్ సభ్యులు సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అధిక మోతాదులో ఎరువుల వినియోగిస్తే కలిగే నష్టాలపై రైతులకు వివరించారు. కార్యక్రమంలో క్లస్టర్ మేనేజర్ మహేష్ ఫౌండేషన్ సిబ్బంది పావని, నవీన్, లింగస్వామి, స్వామి, అంజయ్య, ఆర్పీఎఫ్ అధికారులు ప్రవీణ్, రాకేష్, భవాని, స్థానికులు పాల్గొన్నారు.