![పౌష్టికాహారంపై అవగాహన](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2021/11/26HSB10.jpg?fit=1073%2C576&ssl=1)
సామాజిక సారథి, వలిగొండ: గర్భిణీ స్త్రీలు నాలుగో నెల నుండి తొమ్మిదో నెల వరకు 180 ఐరన్ మాత్రలు తీసుకుని ఆరోగ్యవంతంగా ఉండాలని సర్పంచ్ లు బొల్ల లలిత శ్రీనివాస్, చేగూరి భిక్షపతి అన్నారు. శుక్రవారం వలిగొండ మండల కేంద్రంతో పాటు టేకులసోమారం అంగన్ వాడీ కేంద్రాలలో బాలింతలకు పౌష్టికాహారం, పరిపూర్ణ ఆరోగ్యం అంశంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు నర్సింహారెడ్డి, అంగన్వాడీ టీచర్ లు బి. సోమేశ్వరి, కె దుర్గ, ఆశా వర్కర్ వసంత, గర్భవతులు, బాలింతలు తదితరులు పాల్గొన్నారు.