![వ్యాపారి అరెస్టు](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2021/11/24HSB09.jpg?fit=1018%2C708&ssl=1)
సామాజిక సారథి, రాయపర్తి/వరంగల్: వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కాట్రపల్లి గ్రామంలో వానాకాలం సీజన్ లో రైతులు పండించిన వరి ధాన్యం కొనుగోలు చేసి డబ్బు చెల్లించకుండా తప్పించుకుని తిరుగుతున్న వ్యాపారి గొలుసుల కుమార్ ను బుధవారం రాయపర్తి పోలీసులు అరెస్ట్ చేశారు. కాట్రపల్లి గ్రామంలో రైతుల పంటను కొనుగోలు చేసి కొంతమంది రైతులకు డబ్బు ఇవ్వకుండా రైతులను మోసం చేసినట్లు రైతుల పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కుమార్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపించామని రాయపర్తి ఎస్ఐ బండారి రాజు తెలిపారు.