Breaking News

యూనివర్సిటీలకు వీసీల నియామకం

యూనివర్సిటీలకు వీసీల నియామకం

సారథి, హైదరాబాద్: రాష్ట్రంలోని పది విశ్వవిద్యాలయాలకు వైస్ ఛాన్సలర్ లను ప్రభుత్వం నియమించింది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు ప్రభుత్వం ఏర్పాటుచేసిన సెర్చ్ కమిటీలు, రాష్ట్రంలోని యూనివర్సిటీ లకు వీసీల నియామక ప్రక్రియను చేపట్టింది. కరోనా నేపథ్యంలో కొంత ఆలస్యం జరిగినా, నిబంధనల ప్రకారం అభ్యర్థుల ఎంపిక కసరత్తు పూర్తిచేసి గవర్నర్ ఆమోదం కోసం సిఫారసు చేశారు. శనివారం రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ వీసీల నియామకానికి ఆమోదం తెలిపారు.
వీసీలు ఎవరంటే..
ఉస్మానియా యూనివర్సిటీ(హైదరాబాద్) వీసీ గా ప్రొఫెసర్ డి.రవీందర్ యాదవ్ (బీసీ), కాకతీయ యూనివర్సిటీ (వరంగల్) వీసీగా ప్రొఫెసర్. టి.రమేష్ (బీసీ), తెలంగాణ యూనివర్సిటీ(నిజామాబాద్) వీసీగా ప్రొఫెసర్ డి.రవీందర్ (వైశ్య), డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ(హైదరాబాద్) వీసీగా ప్రొఫెసర్ సీతారామారావు (ఓసీ, బ్రాహ్మణ)., పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ(హైదరబాద్) వీసీ గా ప్రొఫెసర్ టి.కిషన్ రావు(ఓసీ వెలమ), పాలమూరు యూనివర్సిటీ(మహబూబ్ నగర్) వీసీగా ప్రొఫెసర్ లక్ష్మీకాంత్ రాథోడ్(ఎస్టీ), మహాత్మాగాంధీ యూనివర్సిటీ(నల్లగొండ)వీసీగా ప్రొఫెసర్ సీహెచ్ గోపాల్ రెడ్డి, జవహర్ లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ (హైదరబాద్) వీసీగా ప్రొఫెసర్ కట్టా నర్సింహారెడ్డి (ఓసీ), శాతవాహన యూనివర్సిటీ(కరీంనగర్)వీసీగా ప్రొఫెసర్ మల్లేశం(ఎస్సీ మాల), జవహర్ లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ(హైదరాబాద్) వీసీగా కవిత దర్యాని (ఓసీ, సింధి)లను గవర్నర్ ఆమోదం మేరకు ప్రభుత్వం నియమించింది.