![కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షులుగా రాము నియామకం](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2022/10/29HSB12.jpg?fit=350%2C350&ssl=1)
సామాజిక సారథి, నాగర్ కర్నూల్: యువజన కాంగ్రెస్ పార్టీ నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షునిగా కొడిదాల రామును నియమించినట్లు ఆ పార్టీ యువజన రాష్ట్ర అధ్యక్షులు కె. శివసేనారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన నాటి ప్రజాసంక్షేమ పథకాలను గడపగడపకు తీసుకెళ్లడమే కాకుండా యువజనులను చైతన్యం చేసేందుకు పలు కార్యక్రమాలను రాము చేస్తున్నట్లు చెప్పారు. ప్రజల్లో పార్టీ బలోపేతానికి మరింత కృషి చేయాలని ఆయన ఆకాంక్షించారు. అనంతరం రాము మాట్లాడుతూ నాపై నమ్మకంతో యువజన కాంగ్రెస్ పార్టీ యూత్ జిల్లా అధ్యక్షునిగా బాధ్యతలు అప్పగించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రాము నియామకం పట్ల కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షులు, యువజన నాయకులు, పార్టీ కార్యకర్తలు తదితరులు హర్షం వ్యక్తం చేశారు.